Monday, November 27, 2023

YCP policy blunders list

  1.       ఆఫీసు,బడి,సమాధి,గుడి దేన్ని వదలకుండా వేల కోట్లు రంగులు వెయ్యడం. మార్చడం.

    2.      సన్న బియ్యం ఇవ్వకుండానే వాటి కోసం 750 కోట్లు విలువ సంచులు

    3.      రాజధాని తో 3 ముక్కలాట ఆడడం.

    4.      రాజధానికి భూములిచ్చిన రైతులకు నరకం చూపించి వాళ్ళని మంత్రులతో బూతులు తిట్టించడం.

    5.      పరిశ్రమల్ని తరిమెయ్యడం.

    6.      ప్రజా వేదిక కూల్చడం.

    7.      చట్ట ప్రకారం నిలవదు అని తెలిసినా మొండిగా చట్టలు చెయ్యడం. కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకుని క్యాన్సిల్ చెయ్యడం.

    8.      మళ్ళీ నిలవని చట్టాల కోసం సుప్రీం దాక వెళ్ళి జనం సొమ్ము లాయర్లకు తగలెయ్యడం.

    9.      రోడ్లు వెయ్యకుండా డబ్బులు వాడెయ్యడం.

    10.   కట్టేసిన టిడ్కో ఇళ్ళు చెదలపాలు చేసి, జనానికి నరకం చూపించడం.

    11.   తిట్టడానికి మంత్రులు, ప్రభుత్వం నడపడానికి సజ్జల.

    12.   హద్దు పొద్దూ లేని అప్పులు.

    13.   ప్రభుత్వ జీ.వో. ఆన్ లైన్ లో పెట్టకుండా దాచడం.

    14.   చెట్లు నరికేసి, పరదాలు కట్టెసి, వ్యాపారాలు/స్కూళ్ళు/కాలేజీలు మూసేసి పర్యటన చెయ్యడం

    15.   వందల మంది సలహాదారులు కోట్లలో జీతాలు.

    16.   700 వందల పదవుల్లో సొంత కుల మందిని కుర్చోపెట్టడం.

    17.   మద్యం అమ్మకాల్లో మొత్తం రహస్యమే. అసలు క్యాష్ ఒక్కటే ఎందుకు?

    18.   వేల కోట్ల రుణాలు తెచ్చిన కార్పోరేషన్ల లెక్కలు కాగ్ ఆడిట్ కి పంపకపోవడం.

    19.   పచ్చిగా ఒక కులం మీద స్పీకర్ తో సహా మంత్రులందరూ దాడి చెయ్యడం.

    20.   15 కోట్ల విలువ చేసే రిసార్ట్ కూల్చి రుషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కట్టడం

    21.   ఉద్యోగుల పీ.యఫ్ డబ్బులు వాడెయ్యడం.

    22.   ఉద్యోగుల అరియర్స్ ఇవ్వకుండ ఇచ్చినట్టు లెక్కలు చూపి, ట్యాక్స్ సొమ్ము ముందే కట్ చెయ్యడం.

    23.   పోలవరం కాంట్రాక్టరుని మార్చి మొత్తం నిర్మాణాన్ని పడుకోపెట్టడం

    24.   సెక్స్ స్కాండల్స్ లో ఎప్పుడూ ప్రముఖం గా వుండే వాళ్ళని మంత్రులని చెయ్యడం.

    25.   ఒక్క సారి కూడా ప్రెస్ తో లైవ్ మీటింగ్ పెట్టలేని దైన్యం

    26.   సాక్షి ఉద్యోగులని సలహాదార్లు పెట్టి వాళ్ళకి జనం సొమ్ము జీతం ఇవ్వడం.

    27.   జనం సొమ్ము తో సాక్షి కొనడానికి వాలంటీర్లకు 200 అలవన్స్ ఇవ్వడం.

    28.   ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇప్యాక్ మితిమీరిన జోక్యం.

    29.   యూనివర్సిటీల పేర్లు మార్చెయ్యడం

    30.   కర్నూలు కి దూరం చేసి పులివెందుల మీదుగా ఎన్.హెచ్ అలైన్మెంటు మార్చెయ్యడం

    31.   మర్డర్ కేసులో లో సస్పెండ్ చేసిన ఎం.ఎల్.సీ ని పబ్లిక్ గానే పక్కన తిప్పుకునేంత బరితెగింపు

    32.   దేశం మొత్తానికి గంజాయి ప్రొడక్షన్ సెంటర్ గా మారిన చెతకానితనం

    33.   టైం కి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోవడం

    34.   4.5 ఎళ్ళగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేక పోవడం.

    35.   ఫస్ట్ ఇన్-ఫస్ట్ అవుట్ పద్దతి లో చెల్లించే కాంట్రక్టరు చెల్లింపు వ్యవస్థ ని కూల్చి నచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు చేసేలా జీ.వో ఇవ్వడం.

    36.   మంచి ఆదాయం తెచ్చిపెట్టే సినిమా టికెట్ల మీద ప్రతాపం చూపించి పగ సాధించడం

    37.   అముల్ కి పాలు పోస్తె జనం సొమ్ము ఇన్సెంటివ్ గా ఇవ్వదం. పాలు పొయ్యమని వేధించడం

    38.   అముల్ కోసం లోకల్ డైరీలన్నింటినీ వేధించడం.

    39.   సెంటు స్థలం లో ఇళ్ళు కడతా అని స్లం ఏరియాలకి ప్రాణం పొయ్యడం. అవి కూడా కట్టలేకపోవడం.

    40.   డైరెక్టు గా అకౌంట్లో పడే పించన్ ని వాలంటీరు చేత విత్ డ్రా చేయించి ఇంటికి వెళ్ళి ఇవ్వడం.

    41.   వున్న పంచాయితీ వ్యవస్థ ని పడుకో పెట్టి సచివాలయ వ్యవస్థ తో వ్యవహారం నడపడం.

    42.   కులానికో కార్పోరేషన్ కానీ నిధులు సున్నా.

    43.   రిటైర్మెంటు బెనిఫిట్స్ ఇవ్వలేక రిటైర్మెంటు వయసు పెంచెయ్యడం.

    44.   టీచర్లకు ట్రైనింగ్ లేకుండ బలవంతపు ఇంగ్లీష్ మీడియం. అది ఫెయిల్ అవ్వడం తో బైజూస్ ట్యాబ్లెట్ కోర్స్. టోఫెల్, .బీ. చివరకు ఏం కోర్సు చెప్తున్నారో కూడ ఎవరికీ క్లారిటీ లేదు.

    45.   న్యాయ సమీక్షకు నిలబడని దిశ చట్టం. అది చట్టమని జనాన్ని నమ్మించె ప్రయత్నం.

    46.   కలక్టరేట్లు, తహసిల్దార్  ఆఫీసులు కూడా అమ్మెయ్యడం లేదా తాకట్టు పెట్టడం.

    47.   ఎయిడెడ్ స్కూళ్ళు మూసేసి వాటి స్థలాలు అమ్మెయ్యడం.

    48.   సివిల్ కేసులను క్రింది కోర్టుల్లొ దావా వెయ్యకుండా చట్టం చెయ్యడం.

    49.   మొత్తం ప్రభుత్వ కార్యక్రమాల స్టేటస్ ని పబ్లిక్ డొమైన్ లొ చూపించే సీ.యం. డ్యాష్ బోర్డ్ ని ఎందుకు దాచేయ్యడం?

    50.   డెత్ సర్టిఫికేట్లు, పట్టాదారు పాస్ బుక్స్ సంగతై తరువాత..లీగల్ డీడ్ ఐన రిజిస్ట్రేషన్ పత్రాల మీద ఫోటొలు వేసుకోవడం.

    51.   3 రాజధానుల బిల్లు పాస్ అవ్వలేదని మండలి రద్దు చెయ్యాలని ప్రయత్నించడం.

    52.   చంద్రబాబు ఇంటిని ముంచే తాపత్రయం లో బ్యారేజీ గేట్లు తెరవకుండా కరకట్ట ఆనుకుని ఉన్న గ్రామాలను ముంచడం.

    53.   భూ సర్వే రాళ్ళ మీద బొమ్మ చెక్కి వేయించాలనే ప్రయత్నం. ఖర్చు పేలడం తో పేరు తో సరిపెట్టుకోవడం.

    54.   5 ఉపముఖ్యమంత్రులు ఎందుకో తెలియదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గవర్నెన్స్ మీద అప్డేట్లు ఎందుకు ఇవ్వలేరో తెలియదు.

    55.   రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ఎక్కడెక్కడొ జనాన్ని తెచ్చి వాళ్ళకి సెంటు స్థలం లెక్క పంచెయ్యాలని చూడడం.

    56.   లీగల్ గా కరెక్టు గా వున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అడ్డం గా రద్దు చేసి, అది కోర్టులో నిలబడక వాళ్ళకి జనం సొమ్ముతో పెనాల్టీ కట్టడం.

    57.   లీగల్ గా వైజాగ్ వెళ్ళలేం అని తెలిసినా కూడా, పరిపాలన తరలించే ప్రయత్నం లో .టీ కంపెనీలకు ఇవ్వకుండా మిలీనియం టవర్స్ 4.5 ఏళ్ళుగా ఖాళీగా పెట్టడం.

    58.   ఫ్రీ గా పంపిణీ చేసే రేషన్ లేపేసి సైరెన్లు పెట్టి బియ్యం వ్యాన్లు. ఒక్కొ వ్యానుకీ నెలకు 34 వేల ఖర్చు


Saturday, March 16, 2019

మీడియా మద్దతు ఎవరికి???

మీడియా మొత్తం టీ.డీ.పీ కీ సపోర్ట్ అనే స్టీరియో టైపిక్ మెంటాలిటీ తో వున్న వారికి నా అనాలిసిస్ ఇది. నాది తప్పు అనేలా మీ అనాలిసిస్ వుంటే ఇవ్వండి సరిదిద్దుకోగలను.

ముందుగా ఎక్కువ టీ.ఆర్.పీ లేదా ఎక్కువ వ్యూయర్ షిప్ వున్న చానళ్ళు కొన్ని తీసుకుని వాటి తీరుతెన్నులు చూద్దాం - TV9, ABN, ETV 2, Saakshi, TV5 , NTV, TNews, V6, 99 TV, Studio N

TV 9
1. వీడో గోడ మీద పిల్లి. ఒక స్టాండ్ అంటూ వుండదు. ఒక వార్త ని సెన్సేషనలైజ్ చెయ్యడానికి ఏ పార్టీ వైపైన మొగ్గు చూపుతాడు. ఉదా: జగన్ లోటస్ పాండ్ తనిఖికేసు, బాలక్రిష్ణ కాల్పులు కేసు, చింతమనేని నోటీ దురుసు కేసులు. ఇలా బోలెడు.
2. పనికిమాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి చర్చా కార్యజ్రమాల్లో గొడవలు రేపుతాడు.
3. ఒక రోజు మొత్తం ఈ చానల్ చూస్తే అన్ని పార్టీల వాళ్ళనీ ఎక్కడ సెన్సేషన్ ఐతే అక్కడ బురద చల్లేస్తాడు.
4. 50 చనిపోతే 100 అని. 100 పోతే 200 అని అటెన్షన్ రాబట్టుకోవడం వీడి ప్రత్యేకత.
5.అందరినీ పొగుడుతాడు ..అందరినీ తిడతాడు కాబట్టి వీడిని న్యూట్రల్ అనుకోడానికి లేదు. ఎందుకంటే వీడు దొరికిన న్యూస్ వెయ్యడు. దొరికిందాన్నే న్యూస్ చేస్తాడు

ABN
1. భజన కి మారు పేరు. ఇక్కడ టీ.డీ.పీ కి అక్కడ టీ.ఆర్.యస్ కీ వీడీ భజన ఒక రేంజి లో వుంటుంది.
2. ఒక పెద్ద మీడీయా హౌస్ అనే భాధ్యత ఏమాత్రం లేకుండా వీడీ వెబ్ సైట్ లో నిస్సిగ్గు గా క్లిక్ బెయిట్ హెడ్డింగులు పెడుతున్నాడు
3. ఒక్క రోజులోనె స్టాండ్ మార్చుకోడానికి ఏ మాత్రం ఇబ్బంది / సిగ్గు పడడు.

ETV 2
1. వీళ్ళ న్యూస్ డెలివెరీ లో ఒక క్రెడిబిలిటీ వుంటుంది. వార్త పూర్తి గా నిజమా కాదా అనేది నిర్ధారణ కాకుండా పుకార్లు వెయ్యరు.
2. పనికిమాలిన వెధవల్ని తీసుకొచ్చి చర్చా కార్యక్రమాలు పెట్టి కొట్టుకునే వ్యవహారాలు వుండవు . ప్రతిధ్వని కార్యక్రమం దీనికి బెస్ట్ ఉదాహరణ.
3. రోజూ ప్రభుత్వ వైఫల్యాలు గురించి వార్తలు పడుతూనే వుంటాయ్. కానీ స్టీరియో టైపిక్ బుర్ర తో అసలు చానలే చూడని  జనాల కళ్ళ కు అవి కనపడవు. ఇసుక మాఫియా మీద వీళ్ళు ఇచ్చినంత కవరేజి నాకు తెలిసి సాక్షి కూడా ఇవ్వలేదు.
4. వార్త ని వార్త గానే వేస్తారు తప్ప తీర్పులు ఇవ్వడం అరుదు.
5. ఒక వేళ ఇది జరగనిది జరిగినట్టు గా రాశారు అంటే నాకు లింక్స్ పంపండి చూసి తెలుసుకుంటాను.

NTV
1. మొదట్లో సాక్షికి తమ్ముడు గా వుండే ఈ చానల్ తరువాత తీరు మారింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం లో వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆంధ్రా ముఖ్యమంత్రి ని తెలంగాణా పోలిసులు అరెస్ట్ చెయ్యబోతున్నారని వేసిన హెడ్డింగులు ఎలా మరిచిపోతాం. అసలు కొమ్మినేని వారు ఇక్కడ పని చేసినపుడు టీ.డీ.పీ మీద ఎత్తి పోసిన దుమ్ము బురద ఆళ్ళు ఇప్పటికీ కడుక్కుంటున్నరు.
2. కే.సీ.ఆర్ కి అత్యంత సన్నిహితుడు మై హోంస్ రాజేశ్వర రావ్ చేతి లోకి ఈ చానల్ వెళ్ళాక దీని తీరు మారింది. తెలంగాణా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు.
3. అసలు ఈ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే డిస్కషన్ పెట్టడం కూడా వేస్ట్
4. ఎదైన వ్యవహారం లో టీ.డీ.పీ తప్పు దొరికినా వీళ్ళు సమర్ధించారు అనే లా ఎమైన వార్తలు దొరికితే ఇవ్వండి. దాంతో పాటు టీ.డీ.పీ ది తప్పు అనేది ఎలాగో కూడా వివరణాత్మకం గా రాయండి తెలుసుకుంటాను.

TV 5
1. ఎన్. టీవీ తో పాటు దీంట్లో కూడా మై హోంస్ వారు పెట్టుబడులు పెట్టడం జరిగింది.
2. పార్టీ తరపున హిందుత్వ ప్రచారానికి డబ్బులు తీసుకోవాడనికి రెడీ అయ్యి స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన చరిత్ర వీడిది. (https://thelogicalindian.com/news/cobrapost-expose-hindutva-money-newspapers/)
3. మొదట్లో పక్కా వై.కా.పా వాది వుండే వాడు తరువాత కొంచం జోరు తగ్గింది.

Studio N
1. తారక్ కి పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు ఛానల్ ఇది. తారక్ తో పెళ్ళి టైం లో టీ.డీ.పీ కి భీభత్సమైన సపోర్టర్ . తరువాత ఎమైందో తెలీదు రివర్స్ ఐపోయాడు
2. ఈ మధ్య అతను వై.కా.పా లో చేరడం తో అసలు ఈ చానల్ ఎవరికి సపోర్ట్ అనే దాని గురించి చర్చ అనవసరం. (https://www.youtube.com/watch?v=M4gEpT7SO6s)

TV 99
1. జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశెఖర్ దీనిని కొనుగోలు చేసిన తరువాత.. జనసేన అభిమానులు దీనిని చూడడం మొదలెట్టాక ఇది వెలుగులోకి వచ్చింది.
2. కాబట్టి ఇది ఎవరికి మద్దతు అనే కూడా చర్చకు రాదు (https://twitter.com/search?q=99tv+janasena&ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Esearch)

T News and V6
1. ఇవి సాక్షికి తెలంగాణా వెర్షన్లు. కాకపోతే ఒక్క కే.సీ.ఆర్ కి మాత్రమే ఆ భజన.
2. భజన లో ఆంధ్రజ్యోతి / సాక్షి తో కూడా పోటీ పడతాయి

ఇప్పుడు చెప్పండి బాబులు... ఇంకా నేను వదిలి పెట్టిన భారీ చానళ్ళు ఏమైనా వున్నాయ.. వుంటే వాటి వ్యూయర్ షిప్ ఎంత? 
చెప్తే లెక్కలు తెగ్గొట్టేద్దాం.

ఇక్కడ దరిద్రం ఏంటంటే మన బుర్ర తక్కువ మేధావులు సాక్షిని మిగిలిన చానళ్ళను ఒకే గాటాన కట్టడం. సాక్షి వారి వీర భజన్ కి కొన్ని మచ్చి తునకలు
1. జగన్ అన్న కోసం అన్నం మానేసిన 6 ఏళ్ళ చిన్నారులు
2. ఒక పక్క కౌంటింగ్ లో వెనుకపడుతున్నా కూడా విజయపధం లో దూసుకుపోతున్న జగన్ 

ఇంత దారుణమైన భజన వార్తలు మిగిలిన చానల్స్ లో అంత కనపడవు. ఫేక్ వార్తలు వేసే ముందు వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పోతుందనే భయం మిగిలిన వాళ్ళకి వుంటుంది. అలాంటిది అన్నీ ఒకటే అని ఎలా అంటాం. సాక్షి ని ఏమన్న అనడం పాపం అన్ని చానల్స్ ఒక్కటే రా అంటు దీర్ఘాలు మొదలెడతారు. 
ఇక్కడ తప్పుకి కొలమానం లేదా లేక మనసు లోతుల్లో వున్న క్యాస్ట్ ఫీలింగ్ / చంద్రబాబు వ్యతిరేకత మీ రేషనల్ థింకింగ్ ని  కమ్మేసిందా? 

కాబట్టి మొత్తం గా చూస్తే టీ.డీ.పీ కి మద్దతు ఇచ్చేది నికరం గా ఆంధ్ర జ్యోతి ఒక్కటే కనపడుతుంది. ఈనాడు వార్తల కవరేజి లో ప్రైయారిటీ ఇస్తుంది తప్ప బైయాస్డ్ వార్తలు తక్కువ. 

దీనికి సమాధానం చెప్పాలంటే కరెక్టు ఆధారాలతొ ఆపై మీ అనాలిసిస్ తో రండి అంతే కానీ మళ్ళీ ఇర్రేషనల్ స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. ఈ సారి ఇంత సౌమ్యం గా నా సమాధానం ఉండకపోవచ్చు 

Saturday, February 23, 2019

అంబ: 120 కోట్ల భారతం ఏది చూడాలో ఏది చూడకూడదో నిర్ణయించే అధికారం నాకు కావాలి
పీ.యస్: ఏం చెద్దాం? జనాలు చూసే కేబుల్ టీ.వీ లు మన కంట్రోల్ లో తెచ్చుకుందామా?
అంబ: అది తరువాత. జనం ఎక్కడికెళ్తే అక్కడికి టి.వి. లు మోసుకెళ్ళరు. వాళ్ళతో ఎప్పుడు వుండేది సెల్ ఒక్కటే. ముందు దాని సంగతి చూద్దాం.
పీ.యస్: కానీ మనకి చాల మంది ఆపరేటర్లు వున్నారు కదా..
అంబ: నాకు పోటీ నచ్చదు. కాంపిటీషన్ చచ్చిపోవాలి. ఫ్రీ 3 నెలలు ఫ్రీ.
పీ.యస్: వాళ్ళ చేతుల్లోకి సెల్ వెళ్తే మన మనకి ఒరిగేది ఏంటి?
అంబ: ఇంటర్నెట్ ఫ్రీ. పిల్లా పెద్దా ముసలి ముతక నెట్ లో దొరికే ఏంటర్టైన్మెంట్ మీడియాకి బానిసలు ఐపోవాలి. (https://timesofindia.indiatimes.com/…/articles…/64432913.cms)
అంబ: అది జస్ట్ గ్రౌండ్ అంతే. ప్రైం, నెట్ ఫ్లిక్స్ తరహా లో ఇంటర్నెట్ ఆధారిత మీడియా ప్లాట్ ఫాం మనం పెట్టాలి. సినిమాలు నిర్మించాలి.
(https://www.jiocinema.com/
https://variety.com/…/mukesh-ambani-reliance-industries-ta…/)
పీ.యస్: సరే కాంపిటీషన్ చచ్చి సెల్ మార్కెట్ మన చేతిలోకి వచ్చిందే అనుకుందాం. మరి టీ.వీ లను ఎలా కంట్రోల్ చేస్తాం? జనాలు డి.టీ.హెచ్ చాలా తక్కువ వాడుతున్నారు కదా.

అంబ: క్వాలిటీ వున్న సరే జనాలు డీ.టీ.హెచ్ ఎందుకు వాడట్లేదు?
పీ.యస్: 200 / 250 కి కేబుల్ లో అన్ని చానల్స్ వస్తుంటే జనాలు డీ.టీ.హెచ్ ఎందుకు వాడతారు?
అంబ: అందుకే ప్రతి చానల్ కి డబ్బులు పెట్టి కొనుక్కునే ఒక రూల్ రావాలి. అప్పుడు కేబుల్ డీ.టీ.హెచ్ ఒకే రేట్ కి వస్తాయ్. అప్పుడు మనం మన డీ.టీ.హెచ్ బాక్సుల్ని ఇంటర్నెట్ తో సహా భీబత్సమైన ఆఫర్లతో దింపుతాం. కొద్ది రోజులకి కేబుల్ కి కాలం మూడుతుంది. (https://jio.services/jio-dth/)
పీ.యస్: తరువాత?
అంబ: ఏముంది. నాకు నచ్చిన రూల్స్ పెట్టుకుని కాంపిటీషన్ చంపుతా లేదంటె సాధ్యమైనంత వరకూ తగ్గిస్తా. ఒక సారి మార్కెట్ మేజర్ షేర్ నాది అనుకున్న తరువాత చానళ్ళతో గేం మొదలైతే ఎలా వుంటుందంటావ్? నా మాట వినే చానల్ మాత్రమే ప్రసారమవ్వాలి. నేను చెప్పిందే టెలికాస్ట్ అవాలి.
పీ.యస్: ఇలానే అనుకుంటే నెట్ న్యూట్రలిటీ మీద పెద్ద యుద్ధం జరిగి గూగుల్ ఫేస్బుక్ కలలు కల్లలైయ్యాయి.
అంబ: వాళ్ళకి గేం సరిగ్గా ఆడడం రాలేదు. నేను గేం ఆడడం మొదలెట్టి 3 ఏళ్ళైయాయి ఎవరికన్న అర్ధం ఐయ్యిందా?
అప్పటికీ టీ.వీ, ఫోన్ ఇంటర్నెట్ అంతా మన కంట్రొల్ లోనే వుంటుంది.
పీ.యస్: మహానుభావులు.
అంబ: చేసేది ఎలాంటి పని ఐనా మనకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేకుండ చేస్తే చచ్చినట్టు భరిస్తారు అంతేనా?
భక్తులు: అంతేగా అంతేగా.. జై మేడ్ ఇన్ ఇండియా

ఎంత సముదాయించుకున్నా లాస్ట్ స్టెప్ నిజం ఐతే ఏంటన్న ఊహే నన్ను భయపెడుతుంది

Friday, November 30, 2018


బెంగళూరు లోని ఒక కంపెనీ లో వున్న తెలుగు వారందరూ కలిసి వన భోజనాలు ప్లాన్ చేస్తే తప్పులా కనిపించదు. 
అమెరికా లో భారతియులందరూ కలిసి పార్టి నిర్వహిస్తే తప్పు లా కనిపించదు 
కార్తీక మాస కుల భోజనాల మీద ఎందుకంత వివాదం జరుగుతుంది?

ముందే చెప్తున్నా.. కాస్త బుర్ర పెట్టి చదవండి... నేను ఇక్కడ మంచి చెడూ నిర్ణయించట్లేదు. మన సమాజం లో అలోచనా తీరు ని కేవలం అనాలిసిస్ చేస్తున్నా. నా చిన్నప్పటి నుండీ ప్రవర్తన / అలోచనా తీరు లో మార్పులే ఈ పోస్టు కి కారణం. 
కులం పేరిట ఎవరైనా గ్రూపు కడితే వారి గురించి మనకి సాధారణం గా వినిపించే మాటలు: 
1. కుల గజ్జి మనుషులు.
2. ఈ కాలం లో ఇంకా కులమేంటి 
3. కులం కూడు పెడుతుందా?

నాకు ఏమనిపిస్తుందంటే అసలు ఈ గ్రూపులు కట్టే అలోచనా విధానం మనిషి లో అంతర్భాగం. అది దేన్ని ఐనా బేస్ చేసుకుని కడతారు. భాష/మతం/ప్రాంతం/ కులం/ రాష్ట్రం/ జిల్లా / దేశం/ రంగు/ జాతి / డబ్బు / ఉద్యోగం / చెప్పుకుంటే చాలా వున్నాయి.
ఉ.దా: కుల సంఘాలు, తానా, 

గ్రూపు కట్టడానికి కారణం ఎదైనా వుండొచ్చు. "మాకు అన్యాయం జరుగుతుంది" / "మేము అందరం సమిష్టి గా వున్నాం .. ఇది మా బలం అని చాటుకోవడం" / "అందరు కలిసి వుంటే ఆపదలో ఒకరికొకరు తోడు నిలుస్తారు లే". "అందరం ఒక ఆశయం కోసం కలిసాం" ఇలా కారణం ఏదైనా కావొచ్చు.  

గ్రూపు కడితే ప్రమాదం లేకపోవచ్చు. మేము గొప్పోళ్ళం అవతల గ్రూపు వాళ్ళు ఎదవలు/చేత కాని వాళ్ళు అని అలోచిస్తే అది ప్రమాదం. ఈ అలోచనా తీరు అన్ని రకాల గ్రూపుల్లో కనపడుతుంది. ఇద్దరు తెలుగోళ్ళు కలిసి అరవోడి మీద జోకులు వేస్తాం. హింది వాళ్ళు మన సినిమాల మీద వెశ్తారు. కరుడు కట్టిన దేశ భక్తులు పాకిస్తాన్/చైనా పేరెత్తితే బండ బూతులు తిడతారు.
విచిత్రం ఏంటంటే పైన చెప్పిన పనులు చేసి ఎదో ఒక గ్రూపు లో మెంబర్ గా వుండి ఒక్క కులం విషయం లోకి వచ్చే సరికి ఆదర్శాలు వల్లే వేస్తాం. 
ఏం? ఒక అపార్టుమెంటు లో తెలుగు వారు మాత్రమే కలిసి భోజనాలు ఏర్పాటు చేస్తే తప్పు కానిది ఒక పల్లెటూరి లో ఎవరి కులం వారు వారి వన భోజనాలు పెట్టుకుంటె తప్పెలా అవుతుంది. భాష/దేశం పరం గా గ్రూపు కడితే తప్పు కాదు. కులం పరం గా కడితే మాత్రం తప్పెలా అవుతుంది? 

తప్పు ఎప్పుడంటే ఒక కులం భోజనాలు పెట్టుకుని ఆ మీటింగులో మిగిలిన కులాల్ని చులకన చేస్తే అప్పుడు తప్పు అవుతుంది.
ఎవడి మానాన వాడు పార్టికి వచ్చి తిని కాసేపు సరదాగా గడిపి ఇంటికి పోవడానికి అది కుల సంఘం భోజనం ఐతే ఏంటి? భాషా / ప్రాంత/ రాష్ట్ర సంఘం భోజనాలు ఐతే ఏంటీ. ఒక్క కుల సంఘాల భోజనాలకే ఇంతా విమర్శలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్ధం కాదు 

ఇది సంకుచితం ఐతే అదీ సంకుచితమే కదా? లేదంటే అది తప్పులేదంటే ఇది తప్పు లేదు? 
నా ఈ డౌటుని ఎవ్వరైనా కింద కామెంట్ల రూపం లో తీర్చొచ్చు.. 
గ్రూపు కట్టడం వల్ల మంచి ఎంత వుందో చెడు అంతే వుంటుంది. అది ఆ గ్రూపులో వుందే జనాల అలోచన విధానం మీద ఆధార పడి వుంటుంది. 

"కుల సంఘాల భోజనాల్లొ తమ కులం గురించి గొప్పలు చెప్పుకుంటారు. అది మంచిది కాదు". ఆ గొప్పలు రాష్ట్ర సంఘాల మీటింగుల్లో తమ రాష్ట్రం గురించి ..భాషా సంఘాల్లో తమ భాష గురించి కూడా డబ్బ కొట్టుకుంటాం అంతెందుకు పరాయి దేశం లో మన దేశం గురించి డబ్బా కొట్టమా? 

ఒక మనిషి చేసిన గొప్ప పని ని ఆ మనిషి యొక్క దేశం/రాష్ట్రం /జిల్లా/ ఊరు వారు గొప్పగా చెప్పుకుంటే తప్పు లా కనిపించదు.  కాని ఆ మనిషి యొక్క కులస్ఠులు గొప్పలు పోతే అది పెద్ద బూతు లా వినిపిస్తుంది. ఇక్కడ దేశం/రాష్ట్రం /జిల్లా/ ఊరు గొప్ప మాత్రం ఏముంది. అది ఆ మనిషి గొప్ప కదా? 
ఉ.దా: బాహుబలి విజయం తరువాత రాజమౌలీ / ప్రాభాస్ తెలుగు ముద్దు బిడ్డలు అంటె కోపం రాదు. కాని ఆ కులం వారు మా కులం బిడ్డలు అంటె మాత్రం కోపాలు వస్తాయ్. అంతెందుకు బాహుబలి తెలుగు సినిమా కాదు భారతీయ సినిమా అంటేనే మన తెలుగోళ్ళకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఫేస్ బుక్ లో నానా రచ్చ చేశారు.
దీన్నే అంటారు స్టీరియో టైపింగ్ అని.. 

Saturday, October 27, 2018


నేను క్రిందపెట్టిన పోస్ట్ (https://www.facebook.com/sriharsha.karuturi/posts/2168471956517935) ఒక్క రోజులో అవేశం లోనో కోపం లోనో పెట్టింది కాదు. ఎప్పటి నుంచో అలోచిస్తున్న సమస్యే. ఆ పోస్ట్ లో ఇంకా చాల విషయాలు కారణాలు సవివరం గా రాయాలని అనుకున్నాను. ఎందుకంటే అది చాలా పెద్ద నిర్ణయం. కాని అవి రాస్తే నాకు తెలిసిన కొందరు నా YSRCP మిత్రులు చేసిన పనులు వుదాహరించవలిసి వస్తుంది. అవి చెప్పి వారిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. అందుకే చాలా క్లుప్తం గా ముగించాను.  కింద నేను పెట్టిన సమాధానం చదివే ముందు దయచేసి పోలరైస్ కాకుండ చదువు. ఇది నా అనాలిసి మాత్రమే. నాది తప్పు అనేలా రేపు ఎవరు నిరూపించినా నేను ఒప్పుకుంటాను.  This post is just a reply to a comment for the above FB post.

హెరిటెజ్ సంస్థ స్థాపించి ఎదిగింది షార్ట్ టైం లో కాదు. అది మొదలు పెట్టి 26 ఎళ్ళు ఐయ్యింది. ఇక్కడ విషయం ఏంటంటె అది స్థాపించిన చంద్రబాబు స్థాయి చూస్తున్నారు కాని ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలైన భువనేశ్వరి ఎవరి కూతురనేది మరిచి పోయారు. ఎన్.టీ.ఆర్ దాదాపు 40 ఏళ్ళు సినిమాల్లో లో ఎంతో సంపాదించారు. అది తన పిల్లలకు పంచకుండా వుండరు గా. మీరు చెప్తున్న 177 లెక్క లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్రామ్హణి తండ్రి నుండి తెచ్చుకున్న ఆస్థులు కూడా చేరాయ్. పోనీ మీరు అనుకుంటున్నట్టు ఆ పాయింట్ కూడా రూలవుట్ చెద్దాం. చంద్రబాబు అవినీతి చేసేశాడు అనుకుందాం. అప్పుడు అది Disproportionate assets కేస్ అవుతుంది. అంటె అదాయానికి ఆస్తులకు సంబంధం లేకుండా వుండడం.

ఒకసారీ చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చూస్తే టీ.డీ.పీ పెట్టిన నాటి నుండీ కేంద్ర పార్టిలకు ముఖ్యం గా కాంగ్రేస్ కు కొరకరాని కొయ్య లా తయారయ్యాడు. టి.డీ.పీ పెట్టిన నాటి నుండీ కేంద్రం లో ఏర్పడిన ప్రతి నాన్-కాంగ్రేసు ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యం/నేతృత్వం/భాగస్వామ్యం లో ఏర్పడినవే. ఆయన్ను మూయించడానికి అటి ఇటు గా 26 ఎంక్వయిరీ లు వేసారు. అందులో కొన్ని సీ.బీ.ఐ కూడా చేపట్టింది.  అంతం కోపం లో వున్న వారు ఎదైనా క్లూ దొరికితే వదిలి పెడతారా? తెలంగాణా విడిపోయినప్పుడు అన్ని పార్టీలు కలిసి ఆయన పై ఎలా ముప్పేట దాడికి దిగాయొ మనకి తెలిసిందే. అప్పుడు కూడా విధానపరం గా దాడి చెయ్యగలిగారు కాని వ్యక్తిగతం గా ఏమీ చెయ్యలేక పోయారు. ఇప్పుదు కొందరంటున్నారు. ఆ 26 కేసుల్లో కొన్నింటికి స్టే తెచ్చుకున్నాడు అని. ఒకటి రెండు ఐతే పర్లేదు. ఇంక అదే పనిగా కేసులు వేస్తుంటే ఇంక పనులు మానుకుని కోర్టులు చుట్టు తిరగాలా?  2017 కి వచ్చేసరికి ఆ కేసులు కూడా మొత్తం క్లోస్ ఐపోయాయ్. పోనీ కాంగ్రేస్ సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు దేశం లో వ్యక్తిగత కక్షల రాజకీయం నడుస్తుంది. మోదీ కి శతృవులందరినీ ఒక్కొక్కరినీ ఆర్ధికం/రాజకీయం/వ్యక్తిగతం గా దెబ్బతీసి ఏరి పారేస్తున్నారు. ఆళ్ళు మంచోళ్ళా చెడ్డోళ్ళా అని అనవసరం. అందరు లేచిపోతున్నారు. ఇంత కక్షాపూరిత రాజకీయం లో కూడా  వెతికి వెతికి ఎప్పుడో పదేళ్ళ క్రితం బాబ్లి కేసు తోడారు కాని  ఆయన్ని ఏమీ చెయ్యలేకపోతున్నారు గా.
దీనికి కూడా - "లేదు చంద్ర బాబు దేశం లోనే ఎవరికి దొరకనంతగా మేనేజ్ చేస్తున్నాడు" అంటె దానికి ఎంత Probability వుందనేది జనాల బుర్రలకు సంబంధించిన విషయానికి వదిలేస్తున్నాను. ఆయనేమి దేవుడు కాదు. 

ఇక పొతే మన జనాల ఫేవరేట్ లేబుల్ "వెన్నుపోటు" విషయానికి వద్దాం. అప్పటి దాక ఎన్.టీ.ఆర్ ప్రభుత్వం లో కుటుంబ పైరవీలు లేవ్. లపా ఆయన జీవితం లోకి వచ్చాక సమాంతర అధికారం కేంద్రం ఏర్పడింది.  అంటె పేరలల్ పవర్ సెంటర్. ఆయన ఇంట్లో లేనపుడు ఫైళ్ళు పట్టుకుని ఆవిడ దగ్గరకు చేరే వాళ్ళు ఎక్కవైపోయారు. పత్రికల్లో రోజూ అదే న్యూసు ఐపోయింది. 
https://twitter.com/megaloyalfans/status/904348504511864832

https://goo.gl/images/ruFL3r
) జనాలకు పార్టీ మీద నమ్మకం సన్నగిల్లడం మొదలెట్టింది. ప్రజా విప్లవం అనేది తరానికి ఒకసారే వస్తుంది. ఒక సారి అది కోల్పోతే మళ్ళ్ ఇంకో కొత్త వాళ్ళకు అవకాశం రావడానికి ఒక తరం పడుతుంది. 1977 లో జనతా ప్రభుత్వం విఫలం ఐయ్యాక మళ్ళీ ఆం ఆద్మీ విప్లవం రావడానికి 40 ఏళ్ళు పట్టింది. అలాంటిది మన రాష్ట్రం లో ఏన్.టీ.ఆర్ మొండితనం వల్ల పరిస్థితి చెయ్యదాటి పోయింది. అప్పుడు మనం చిన్నపిల్లలమే. కాని నాకు మా నాన్న అవే నాకు విడమరిచి చెప్పే వారు. నీకు గుర్తుండె వుంటుంది అందుకే నేను క్లాస్ లో టిచర్ల తో ఎక్కువ రాజకీయ వాదనలు వేసే వాడిని. క్విజ్ పోటీలకు ఎక్కువ వెళ్ళే వాడిని. 
రాష్ట్రం ఏమి ఎన్.టీ.ఆర్ సొత్తు కాదు నేనే నిర్మించాను నేనే కూలదోస్తాను అనడానికి. కోట్ల మంది భవిష్యత్తు అది.  చివరకు ఒక రోజు ఎన్.టీ.ఆర్ 8 మంత్రులను ఒకేసారి క్యాబినెట్ నుండి బహిష్కరించడం తో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అది. ఇవేమీ నేను ఊహించి చెప్తున్నవి కాదు. పాత జర్నల్స్ తిరగేసి చూస్తే మీకె తెలుస్తుంది. 
((Yes. it is a fact. but it does mater how we label it. A CEO can be thrown out of his own company if he is not performing well. Should we spare a leader who can decide peoples fate.)
వెన్నుపోటుకి కర్రెక్టు ఉదాహరణలు నేను ఇస్తాను చూడు :
1. ఎన్.టీ.ఆర్ అమెరికా వెళ్ళినపుడు 222 బలం తొ వున్న టి.డి.పీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసి 60 మంది తో నాదెండ్ల ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం.
2. చంద్ర బాబు మీద వున్న కోపం మన రాష్ట్రం మీద చూపిస్తూ మోదీ చేస్తున్న పనులు

రేపు చంద్రబాబు వయసు మీరాక ఇలానే తిక్క గా ప్రవర్తించి ఎవరైనా ఆయన్ను పక్కన పెట్టి అధికారం తీసుకుంటె నిర్మొహమాటం గా నేను వాళ్ళకే సప్పోర్ట్ చేస్తాను. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి సొత్తు కాదు. 

ఇంక చివరగా అసలు పాయింటు. (choosing friends by religion is no different that choosing them by political view) . దీనితో నేను ఈ ఒక్క పార్టి విషయం లో  ఏకిభవించలేను మిత్రమా. ప్రపంచం లో ఏ మతం అరాచకాన్ని అధర్మాన్ని చెయ్యమని చెప్పలేదు. అది ఆయా మతాల్లో జనాలు చేస్తున్న తప్పుడు interpretation. అందు వల్ల కొందరి చేసే పనులు మన్సులో పెట్టుకుని ఆ మతం లో వున్న మన స్నేహితులను దూరం చేసుకోవడం మూర్ఖత్వమే. కాని ఇక్కడ ఆ పార్టీ పునాదులె అరాచకం. ఏమంటె అది జరగాల్సిందే. టి.డీ.పీ లో  కూడ తప్పులు జరుగుతున్నాయ్ కాని మరీ ఇంత దారుణం గా కాదు. 1956 నుచి 2009 వరకు మన స్టేట్ లెక్కలు తీసుకుంటే శ్రీమాన్ జగ్గడు గారు దాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఇక్కడ సమస్య అతని ధన దాహం కాదు. అతను అలోచనా విధానం. రైళ్ళు తగలబెట్టిస్తారు, పోలవరం కాలువలకు గండ్లు కొడతారు, రాజధాని తోటలు తగలబెడతారు, గుంటూరు లొ మత ఘర్షణలు లేపాలని చూసారు, లోన్లు రాకుండా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తారు. 

అరే, నాకు తెలిసి ఇంత అరాచకం ఎవ్వరూ చెయ్యలేరు. కొందరు సాక్షి న్యూస్ చదివి టీ.డీ.పీ కూడ అంతే అంటారు. ఎలక్షన్ కౌంటింగ్ లో ఒక పక్క అన్ని చానళ్ళ లో ట్.డీ.పీ గెలుపు మీద వార్తలు వేస్తుంటే సాక్షి లో మాత్రం "గెలుపు దిశ గా దూసుకు పోతున్న జగన్" అని వేసారంటె. దాని క్రెడిబిలిటీ మీద ఇంకా డౌట్స్ రాని బుర్రలకు ఒక లాల్ సలాం. మిగిలిన చానళ్ళు కూడ ఎంతో కొంత పోలరైస్ అవుతాయ్ కానీ ఇంత దారుణం గా కాదు. అలాంటప్పుడు అన్ని ఒక్కటె జాతి అని ఎలా అనగలం? అలాంటి చానల్ చల్లుతున్న బురద ని నమ్మి అందరు రాజకీయ నాయకుల్ని ఒకటే లెవెల్లో ఎలా చూడగలం. తప్పు తప్పుకీ తీవ్రత వుంటుంది. దొంగతనానికి జైలుశిక్ష పడితే హత్య కి ఉరి పడుతుంది. ఇద్దరినీ ఒక్కటే అని ఎలా అనగలం? 

ఇంత బహిరంగంగా ఆ పార్టీ అరాచకాలను సమర్ధిస్తూ జగ్గడిని దేవుడిలా కొలిచే వాళ్ళని ఎలా  ట్రీట్ చెయ్యాలి. 
ఇవన్ని పక్కన పెట్టు. మీ వీధి లో చదువుకుని కాస్త మర్యాదగా నడుచుకునే వారుంటారు. తీవ్ర నేర చరిత్ర వున్న వారుంటారు. ఇద్దరిలో ఎవరిని నువ్వు ఇంట్లోకి రానిస్తావ్? We can definitely not link religion with political parties. 

Friday, March 30, 2018


Why AP is raising the voice - My analysis 


AP Re-organization Bill was passed in 2014.  There was a huge uproar on both sides of AP and Telangana before the bill got passed. It was an emotional wave swept everyone during those times.
Imagine you and your brother worked hard to build an empire under joint family. After some time, your father wrote a will which says
  • 1.       all major revenue yielding assets goes to your brother
  • 2.       You should pay EMI for the loans taken for those lost assets.

As per that BILL, for example, 100 % tax revenue on Hyderabad metro rail goes to Telangana government but AP will continue paying debt share for loans taken to build that metro rail.
Imagine AP has lost how many such revenue yielding assets but ended up paying EMI shares. When you grabbed an asset, why don’t you grab the debt also on that asset.
I have quoted only 1 of such in-human clause in that bill. (Page 13, point 51 and page 14 point 55)
This bill had been passed in chaos during that day where they have stopped parliament LIVE relay and closed the doors. There was absolutely no chance of calculating the AYES/NOES during that chaos but the bill was still passed.

I have quoted High lights of the bill here in simple terms: (you can go through the bill copy herehttp://www.prsindia.org/uploads/media/Telangana/AP%20Reorganisation%20Bill,%202014.pdf)
  • 1.       All assets belong to state where ever they are situated.
  • 2.       Debts shall be shared based on population share irrespective of the asset allocation
  • 3.       AP revenue deficit will be fulfilled by central government for the first 5 years.
  • 4.       Polavaram project expenses will be paid by central government.
  • 5.       New Capital city construction expenses will be paid by central government.
  • 6.       Establishing a new shipping port for AP.

Now, here comes the interesting part of promises for AP which are mentioned as “shall be examined” in that BILL
  • 1.       Special status for AP for 10 years
  • 2.       Railway Zone for Vizag
  • 3.       Metro rails for major cities like Vizag and Vijayawada
  • 4.       A New age modern capital city competent to any of the existing developed cities. (https://www.youtube.com/watch?v=hCaxn9YR7Ms)

Everyone in AP believed that CBN + Modi would be a deadly combination and AP will definitely grow as it was earlier. Even, the key analysts had no doubts on this combination.

Now, start reading below scenarios happened for above mentioned clauses and promises.
  • 1.       Revenue Deficit - After the elections happened, AP govt had started asking to accomplish the basic things (revenue deficit etc.).As per the 14th Planning commission, deficit was 16K Cr for the 1st budget year. But central government has given only 3800 cr till date claiming 4000 cr is final and that to in a span of 4 years after AP CM made 29 trips to New Delhi.
  • 2.       Capital City Central has allocated 2500 crore for building our capital city till date. Do you have any idea how much it costs to build a shopping mall? Does any one can build a city with 2500 crore. To build a national highway, it takes thousands of crores. According to their logic, it needs 3600 cr to build a statue but to build a city 2500 cr is enough.  
  • 3.    Govt related tasks- To accomplish any task which is linked to central, it was never this tough for principal secretaries to get permissions from central. I got this feedback from my dad’s closest friends as he was a govt employee.
  • 4.    Polavaram project:  Initially Total project estimation was around 20K cr but due to new land acquisition act passed in central, total estimation cost has gone to 54K cr. In the first union budget, they have allocated 100cr for a 54K cr project. Should we wait for 540 years to complete that construction? It is better to allocate zero than making such humiliation for AP. After lot of discussions and requests, from past 4 years, 5300 cr has been allocated (again 1900 cr is a loan from NABARD in that) and the project status is 50% completed. (http://polavaram.apegov.com/ispp/aboutUs# ) click on project status to find weekly reports.
  • 5.    Metro rails: 3 Lakhs allocated for vizag metro in union budget 2016. Why so much of humiliation again? Everyone was surprised to hear about an allocation of 3 lakhs in union budget. Should we use that 3 lakhs for its foundation stone. Despite multiple requests, metro rail for Vijayawada was denied showing the technical reasons like population.  Even after merging Vijayawada to new capital region, it was rejected. (You can check 2015 and 16 budget allocations report in Google).
  • 6.       Railway zone: Every state which has even less than 2000 KM rail lines has their own zone. But AP which has 3700 KM Rail line is not entitled to have a separate zone. F Logic!!!? They said Odisha may not accept for this.
  • 7.       Special Status: It was proposed by Venkiah Naidu during that Bill and later agreed by former PM Manmohan singh in Parliament. It was mentioned several times by Modi during public election canvassing.  AP people had no idea what was that special status till it was bought before us. Who asked you to promise us and who gave you authority to deny it now? After elections, they claimed AP is not eligible for special status as per NITI Ayog recommendations. Don’t they know it before? Are they kind of freshers in administration? Cheating allies may be considered as politics but cheating people at this level is nothing but humiliating them? After many discussions and fights, they agreed to give special package instead of status. Till now, not a single penny has been allocated under that package.


Other considerable special treatments for AP:
  • 1.       When AP asks for package funds, these  BJP leaders are showing other regular budgetary allocations as a part of package. If they ask about regular budgetary allocations, again they are showing the same funds. How would you react if you are provided with 2 idlys as tiffin in morning and a photo of same idlys for lunch?
  • 2.       Amit shah has written a letter to AP CM claiming that center is not allocating the funds to AP because AP officials failed to produce the Utilization certificates for the funds allocated till date.But same central government has claimed that AP has already provided UCs. They have provided this information for the question asked by YSRCP MP vijayasai Reddy (Q no 1654 loksabha session)


If BJP/Modi has anger on CBN, why are they showing the wrath on AP public? This is definitely not a quality of statesmanship.

If anyone asks why AP needs all this assistance when they have good enough wealth compared to many other little states, my answer is simple i.e. When I was rich who gave you rights to divide us which landed us in debts and who gave you rights to preach socialist and communist principles in front of us now? Were you sleeping when your own MPs are voting in favor of AP division bill?

If this continues, AP may lose confidence on the republic system of India. If Rest of India keeps mum when Congress/BJP is humiliating AP, we expect them to keep mum at least when we raise our voice against the center. You will feel this pain when this happens to you.  

This is a protestation against partiality
Protestation against false promises
Protestation against anti federative spirits
Protestation against injustice
Protestation against revenge politics
Protestation against humiliation